ఈరొజు నేను ఒక కధ చెపుతున్నాను. ఈరోజుల్లొ పిల్లలకు తాము చాలా తెలివైన వాళ్ళమని నమ్మకం, కాని తెలివికి అతితెలివికి గల తేడా తెలుసుకోకపొతే ఏదో ఒక రోజు చాలా ఇబ్బందిపడతారు అని ఈ కధ చెపుతుంది.
సోమయ్యకు తన కొడుకు సూర్యం చాలా తేలివైనవాడని నమ్మకం. వాడిని పట్నం తీసుకుపోయి, శివనాధుడనే గురువుకు, చదువు చెప్పమని అప్పగించాడు. కొన్నాళ్ళ తర్వాత ఏదొపని వుండి సోమయ్య పట్నం వచ్చి, తన కొడుకు చదువు ఎలా సాగుతున్నదో చూడబొయ్యాడు.
శివనాధుడు సోమయ్యతో, "నీ కొడుకు చాలా అతితెలివిపరుడు, వాడికి చదువు చెప్పడం చాలా కష్టం," అన్నాడు. ఆందుకు సోమయ్య ఒప్పుకోక, "నా కొడుకు చాలా తెలివైనవాడు, మీరు వాణ్ణి గురించి తగినంత శ్రధ్ధ తీసుకొవడం లేదు," అన్నాడు.
ఈ జవాబు విని శివనాధుడు బాధపడి, సూర్యం తెలివితేటలు ఎలాంటివో సోమయ్యకు అర్ధమయ్యేలా చెయ్యాలని వాణ్ణి పిలిచి, చూడు సూర్యం, "పూర్వం మన దేశంలో ఎంతో మంది గొప్ప చేనేత కళాకారులుండేవారు. వాళ్ళు తయారుచేసిన చీరలను అగ్గిపెట్టెల్లో పెట్టగలిగేవారట! అర్ధమైందా?" అని అడిగాడు.
సూర్యం అర్ధమైనదన్నట్టు తల ఊపాడు. "సరే, నేను చెప్పినదాన్నిబట్టి, నీకేం అర్ధమైందో చెప్పు," అన్నాడు శివనాధుడు.
"ఆ కాలంలో అగ్గిపెట్టెల్ని చాలా పెద్దవిగా-అంటే చీరలు పట్టే పరిమాణంలో తయారుచేసేవాళ్ళన్నమాట," అన్నాడు సూర్యం తడుముకోకుండా.
దానితో సోమయ్యకు తెలివికి, అతితెలివికి తేడా తెలిసివచ్చింది. ఆయన శివనాధుణ్ణి తన తొoదరపాటుకు క్షమించమని అడిగి, ఎలాగైనా తన కొడుకుని సరి ఐన మార్గంలో పెట్టమని కోరుకుని వెళ్ళిపోయాడు.
Wednesday, August 8, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment