Sunday, August 31, 2008

నమస్తే,

చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. మేము మొన్న తిరుపతి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. చిరంజీవి గారి
పార్టీ ఆవిష్కరణ టివి లో చూశాను. ప్రజారాజ్యం పేరు సామాన్య మానవుడిని ఆకర్షించేలా ఉంది.
ఇకపోతే ఈవాల్టి చిట్కా చెపుతాను.
కొత్తగా మనం వంటలు చేసేటపుడు మనకు దేంట్లో చింతపండు వేయాలో, దేంట్లో మిరప్పొడి వేయాలో అర్ధం కాదు. దీనికి ఒక చిట్కా చెప్తాను.
చింతపండు వేసే కూరల్లో ఎండుమిర్చి, నిమ్మకాయ వేసే కూరల్లో పచ్చిమిర్చి వాడితే కూర బాగుంటుంది.
ఇప్పుడు మార్కెట్లో వైట్ టీ దొరుకుతొంది, దీనితో టీ చేసుకుని తాగితే పంటి నొప్పి తగ్గుతుంది.
ఈ వైట్ టీని తేయాకు చెట్టు పుష్పించేముందు ఆ పూమొగ్గలు మరియు లేత ఆకులతో తయారుచేస్తారు. ఇది అరుదుగా దొరుకుతుంది మరియు వెల ఎక్కువ గా ఉంటుంది.

No comments: